జూలై 16, 2026

WhatsApp Image 2024 03 07 at 06.24.41

TRINETHRAM NEWS

Trinethram News | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది.
ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. గతంలోనూ ఈడీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటి వరకు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు పంపగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. గురువారం విచారణ కోసం ఏసీఎంఎం దివ్య మల్హోతా జాబితా చేశారు. అయితే, మూడుసార్లు నోటీసులు జారీ చేసినా హాజరుకాకపోవడంతో ఈడీ స్థానిక కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో మార్చి 16న విచారణ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్‌ అంగీకరించారు. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ కేసులో గతేడాది నవంబర్‌ 2 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కింద లైసెన్స్‌ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎల్‌జీ వీకే సక్సేనా మద్యం పాలసీని రద్దు చేసి.. సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఇందులో ఈడీ మనీలాండరింగ్‌ ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.

You cannot copy content of this page