కోటి సంతకాల సేకరణ
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 11, రాజమండ్రి రూరల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దు…. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు సంసిద్ధమై ఉన్నారు.. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్.ముద్దాల తిరుపతిరావు (అను)…. రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముద్దాల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందించారు వారి ఆదేశాలను సారం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు,
చెల్లి బోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులతో కార్యకర్తలతో సమావేశంలో రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని చేస్తామని ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయొద్దనే వారు 100 కి 100% ఉన్నారని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సంతకాల ఉద్యమం లో భాగస్వాములు అవుతారని ప్రజల మద్దతుతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామని చిన్న పెద్ద అందర్నీ కలుపుకుని ఉద్యమంలా సాగుతుందని ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు (అను) జిల్లా అధ్యక్షులు ఆదేశాలతో నిర్వహిస్తామని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


