వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. గత 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. నేటి వరకు పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు రాత్రింబగళ్లు కష్టపడ్డారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల 18వ వార్డులో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పని చేశారు.
18వ వార్డు ఎస్పీ రిజర్వేషన్ వచ్చి ఉంటే కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కేది. జనరల్ రిజర్వేషన్ కావడంతో చిగుళ్ల పల్లి రమేష్ గెలుపుకు కృషి చేసి, 140 భారీ మెజారిటీతో గెలిపించేందుకు శాయశక్తులా పని చేశారు.
1992వ సంవత్సరం నుండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కృషి చేసిన వ్యక్తి అలాగే వికారాబాద్ కు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆలోచనలకు సూచనలకు అనుకూలంగా నడుచుకున్న వ్యక్తి దొడ్ల బుచ్చయ్యకు వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ గా సేవలు చేసేందుకు అధినాయకత్వం అవకాశం కల్పించాలి. రెండు సార్లు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఒకసారి 12ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పుడు అధికారంలో ఉన్న లేకపోయినా అప్పటినుంచి ఇప్పటివరకు పెద్దలు ఏ మాట చెప్తే ఆ మాటకు వింటుంది నడిచిన వ్యక్తి దొడ్ల బుచ్చయ్య నాపై నమ్మకంతో పెద్దలు నన్ను ఆశీర్వదిస్తారు అనుకుంటున్నా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలను తుచ తప్పని వ్యక్తి దొడ్ల బుచ్చయ్యకు కో ఆప్షన్ మెంబర్ గా అవకాశం ఇవ్వాలి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

