త్రినేత్రం న్యూస్,పెనుమూరు. శనివారం ఎంపీడీవో కార్యాలయం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బృందం మరియు ఉపాధి హామీ సిబ్బందితో కలిపి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన మండల అభివృద్ధి అధికారి.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి తన కార్యాలయంలోమాట్లాడుతూ 2024,-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ కింద చేసిన పనులను తనిఖీ సిబ్బంది 15 రోజుల్లో ఆడిట్ నిర్వహిస్తారు కావున వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ సిబ్బందికి అందించవలసిందిగా ఎంపీడీవో ఉపాధి సిబ్బందికి తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామపంచాయతీలలో అందరు ప్రజాప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. వారితో సమన్వయంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ సిబ్బంది మొరార్జీ, డిఆర్పీలు కుమార్,లోకేష్ ఉపాధి హామీ ఏపీవో గుణశేఖర్ మరియు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


