శ్రీ సీతారామ చంద్ర, శివాలయ, ఆంజనేయ స్వామి ధ్వజ స్తంభ, నాభిశిల, దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే .
దేవరకొండ జూన్ 07 త్రినేత్రం న్యూస్.
దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలోని తేల్దేవారి పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర, శివాలయ, ఆంజనేయ స్వామి ధ్వజ స్తంభ, నాభిశిల, దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని,స్వామి వారిని దర్శించుకొని, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలనుదేవరకొండ ఎం ఎల్ ఏ బాలు నాయక్ నిర్వహించారు.
అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:- ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలపై ఉండి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, NSUI నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


