తేదీ : 05/07/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి రాజధాని నిర్మాణం, భూ కేటాయింపులపై సి ఆర్ డి ఏ ఆమోదం లభించిందని మంత్రి నారాయణ వెల్లడించడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే యాభై ఏళ్ళ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, అదే విధంగా ఏడు గ్రామాల్లో అదనపు భూసేకరణ కు కొత్తగా ఇరవై వేల, నాలుగు వందల తొంబై నాలుగు ఎకరాలకు కూడా కూడా సి ఆర్ డి ఏ ఆమోదం లభించిందని తెలిపారు. భూమి విలువ పెరగాలంటే రెండు వేల,ఐదు వందల ఎకరాలలో స్మార్ట్ సిటీ,ఐదు వేల ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అవసరం అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


