WhatsApp Image 2024 02 28 at 22.27.48
41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు బంగారు పతకం సాధించింది. ఈ నెల 21 నుండి 25 వరకు, బీహార్లోని పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన 41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ తెలంగాణ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు బంగారు పతకాన్ని సాధించింది. బుధవారం సచివాలయంలో తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్, బాలికల జట్టుతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు.
