తేదీ : 20/09/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా మాచర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగింది. ఆయన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద ఉన్నటువంటి చెత్తను ఊడ్చారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు. స్వచ్ఛ రథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూపాయలు రెండు కోట్లు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొని మార్గదర్శి బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


