Chairperson Rani : సిసి రోడ్డు పనులను పరిశీలించిన చైర్పర్సన్ రాణి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణం 18వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధులు 27లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సి.సి రోడ్డు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా సి.సి రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైస్సార్సీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మున్సిపల్ డి.ఈ కె.శ్రీనివాసు, ఏ.ఈ డి.పవన్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chairperson Rani inspects CC road works

You cannot copy content of this page

Scroll to Top