డిండి స్థానిక ఎన్నికల్లో ప్రజల చూపు బిజెపి వైపు
డిండి మండలం లో ప్రజా సమస్యలే బిజెపిని గెలిపిస్తుంది
డిండి (గుండ్ల పల్లి)జులై26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం ఈ జె. ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల *మండల అధ్యక్షులు సింకారు సైదా జీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమానికి *ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిండి మండల ప్రభారీ శ్రీ కేతావత్ లాలూ నాయక్ * పాల్గొని మాట్లాడుతూ రాబోయే ఎం పీ టీ సి , , జడ్ పి టీ సి. స్థానిక ఎన్నికలు మన పార్టీకి అత్యంత కీలకం మన ప్రాంత ప్రజల ఆశలు ఆశయాలు మన బీజేపీ పార్టీ పైనే ఉన్నాయని,
ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి ప్రతి ఇంటికి వెళ్లి బి జె పి పార్టీ చేసిన అభివృద్ధి పనులను రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పి అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకోవాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటే ప్రజలంతా మన వైపు చూస్తారు ఈ ప్రాంత ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి మనం కృషి చేస్తే వారిలో ఒకరిగా కలిసిపోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో *బిజెపిజిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి. దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఏ. టీ. కృష్ణ. మాధవరం నర్సింహా రావు. ఎలకుర్తి జైపాల్. వావిళ్ల అంజి యాదవ్. మేళ్ల సాయి. మాధారమోని అంజి. అమృత్. అంజి.రాఘవేందర్. హన్మంత్. పులిజాలా రమేష్. సాయి గౌడ్. తదితరులు పాల్గొనడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


