తేదీ : 04/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అవనిగడ్డ నియోజకవర్గం , కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా డెబ్బై ఎనిమిద వ జయంతి వేడుకలను యాసం. చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. భారీగా అభిమానులు తరలి రావడం జరిగింది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
కోడూరు, నాగాయలంక, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి మండలంలోని రాధారంగా అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. కోడూరులో వెంకట. నరసయ్య ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించి , కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయన గురించి వచ్చిన వాళ్ళందరికీ వివరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


