కాలం చెల్లిన డొక్కు బస్సులతో కాలయాపన చేస్తున్న బాపట్ల డిపో

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు నుండి బాపట్ల కు బాపట్ల నుండి గుంటూరు కు ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేయడానికి నరకయాతన పడుతున్న ప్రయాణికులు..కాలం చెల్లిన డొక్కు బస్సులతో కాలయాపన చేస్తున్న బాపట్ల డిపో.

పల్లేవెలుగు బస్సులు కన్నా అధ్వానంగా ప్రయాణిస్తున్న ఎక్స్ ప్రెస్ బస్సులు.

డ్రైవర్ లు కూడా ప్రయాణికుల పట్ల నిర్లక్యంగా వ్యవహరిస్తున్న వైనం.

బాపట్ల డిపో బస్సులు దారుణంగా ఉన్నాయంటూ ప్రయాణికుల రోదన.

ఆర్టీసి డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేయడానికి ఫోన్ చేసిన తీయడం లేదంటూ పలువురు మహిళ ప్రయాణికులు మండిపాటు..

గుంటూరు నుండి ఎక్స్ ప్రెస్ బస్సు ఒక గంట 30 నిమిషాలకు చేరుకోవాలి అయితే రెండు గంటలు పాటు ప్రయాణం చేసిన గమ్యం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు.

పల్లె వెలుగుకు..ఎక్స్ ప్రెస్ కు ఇంకా తేడా ఏమిటి అని ప్రశ్నిస్తున్న ప్రయాణికులు…

You cannot copy content of this page

Scroll to Top