Public Governance Progress Plan : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి… ఈరోజు కలెక్టర్ అరుణ ఆదేశాల మేరకు మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి ఆదేశాల మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21, 35, 38, 7, 3 డివిజన్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా సప్తరి కాలనీలోని ప్రధాన కాలువలో జెసిబి సహాయంతో పూ డికను తొలగించడంతోపాటు,, బ్లేడ్ ట్రాక్టర్ సాయంతో జిఎం కాలనీ మరియు ప్రశాంత్ నగర్ లో రోడ్డు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలను తొలగించి ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి చెట్లను తొలగించడంతోపాటు లక్ష్మీపురం లోని పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగించి డిసిన్ఫెక్షన్ నిర్వహించడం జరిగింది మరియు హనుమాన్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి చెట్ల పొదలను తొలగించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు కందుల స్వరూప సతీష్,, జంగంపల్లి రమాదేవి శ్రీనివాస్,, వడ్లూరి రవి,, నెల కంటి రాముతో పాటు వార్డ్ ఆఫీసర్లు సంతోష్ సాయి, సాయి కృష్ణ, డివిజన్ల సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం పర్యవేక్షకులు బండార్ రవి, ఆడెపు శ్రీనివాస్, ఎండి ఈసబ్, గడుసు ఉమామహేశ్వర్ స్థానికులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Public Governance Progress Plan,

You cannot copy content of this page

Scroll to Top