వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ : కనీస వేతనాలు 32వేలు ఇవ్వాలి* అందనపు పనులు రద్దు చెయ్యాలి ఐసిడిఎస్ ను పరిరక్షించాలి* కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలి* ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చెయ్యండి జిల్లా ప్రాజెక్ట్ అధికారికి సమ్మె నోటీస్ ఇచ్చిన నాయకులు వికారాబాద్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జిల్లా అధికారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం భారతీ, వికారాబాద్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు లక్ష్మి లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనాలు 32వేలు ఇవ్వాలని, అదనపు పని భారం తగ్గించాలి.
ప్రభుత్వ ఉద్యోగాలు గా గుర్తించాలి. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా తీస్కొచినా కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వాటికి వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు శ్యారా యాదమ్మ స్వరూప యాదమ్మ రేణుబై పెంటమ్మ సునంద స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


