త్రినేత్రం న్యూస్ : డా:బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన పత్రాలను ఈరోజు జిల్లా కేంద్రం అమలాపురం నుండి రాష్ట్ర కేంద్ర కార్యాలయం కు తరలించు కార్యక్రమం పెద్ద ఎత్తున భారీ ర్యాలీ మరియు పాదయాత్ర తో ప్రజా ఉద్యమం విజయవంతం అయినది. స్థానిక హైస్కూల్ సెంటర్ నుండి ఈదరపల్లి వంతెన పాదయాత్ర తో అక్కడ నుండి భారీ ర్యాలీ తో అంబాజీపేట మీదుగా యాత్ర సాగినది..
ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్, పార్లమెంటరీ పరిశీలుకులు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్, అమలాపురం వైస్సార్సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు, రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, ముమ్మిడివరం కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్, పి. గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ రావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, మాజీ ఈ.ఎంపీ చింత అనురాదా, రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలుకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చెయ్యడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


