WhatsApp Image 2025 01 31 at 17.28.04
పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు
జిడికె వన్ ఇంక్లైన్ లో పదవి విరమణ చేసిన ఉద్యోగి మల్లయ్య ను సన్మానించిన అధికారులు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ లో జనరల్ మజ్దూర్ లైసెట్టి మల్లయ్య ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఈరోజు యాజమాన్యం గని పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గని మేనేజర్ రమేశ్, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్బాల్ షరీఫ్ మల్లయ్య దంపతులను ఘనంగా సన్మానించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి వన్ ఇంక్లైన్ పిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎ.సురేష్, నాయకులు నేరేళ్ళ తిరుపతి, గన్నెర్ల చెంద్రయ్య, నరేశ్, ఏగోళపు శంకర్, కొప్పుల లింగయ్య, సర్దార్, సంపత్ రావు తదితరులు పాల్గొని మల్లయ్య దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలపడం తో పాటు వారి యొక్క శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యం గా ఉండాలని ఆకాంక్షించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
