Odisha CM : గిరిజన మహిళలపై అవమాన వ్యాఖ్యలు చేసిన ఒడిశా సీఎం పై బిజెపి ద్వంద్వ వైఖరిపై ఐద్వా తీవ్ర విమర్శలు

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ నవంబర్ 17 (త్రినేత్రం న్యూస్): గిరిజన మహిళలు అత్యంత హీనం గా మాట్లాడిన ఒడిశా ముఖ్య మంత్రి అల్లూరి జిల్లాలో పర్యటించే అర్హత లేదు గిరిజన మహిళా సంఘం (ఐద్వా అనుబంధం) గతం లో ఒడిశా ముఖ్య మంత్రి మోహన్ మజ్జి గిరిజన మహిళలు నల్లగా ఉంటారని వాళ్ళ కట్టుబొట్టు బాగోవాని అందం గా ఉండరని భాష బాగోదని అందుకే నేను గిరిజన మహిళను పెళ్ళి చేసుకోలేదు అని అత్యంత దారుణం గా మాట్లాడిన ఒడిశా ముఖ్య మంత్రి ఏ మొహం పెట్టుకొని అల్లూరి జిల్లా వచ్చారని మహిళ సంఘం ప్రశ్నిస్తుంది ఆడవాళ్ళను గౌరవించలేని ఆడవాళ్ళ పట్ల మంచి ఆలోచన లే ని గిరిజన మహిళలు పట్ల చులకన భావం ఉన్న ముఖ్యమంత్రి నీ ఏరకంగా భిర్సా ముండ ఉత్సవాలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు ఈ మేరకు ఆదివారం అరకు వేలి గిరిజన సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు దేశవ్యాప్తంగా రాత్రి లేదు పగలు లేదు 60 ఏళ్ల ముసలి నుండి చంటి పిల్లలు పై మహిళపై జరిగే అత్యాచారాలు అరాచకాలు అరికట్టలేని బిజెపి గవర్నమెంట్

ఈరోజు భిర్సా ముండా ఉత్సవాలు బిజెపి ముఖ్యమంత్రి పంపడం అత్యంత దారుణం భూముల కోసం కనీస కూలి కోసం గిరిజన హక్కుల కోసం పోరాడి అతి చిన్న వయసులో మరణించిన భిర్సా ముండా అలాంటి ఆశయాల కోసం ప్రాణం అర్పించిన భిర్సా ముండా ఉత్సవాలకు గిరిజన మహిళా లను విమర్శించిన ముఖ్యమంత్రిని తీసుకురావడం కూటమి ప్రభుత్వం చేతగానితనంగా మహిళా సంఘం భావిస్తుంది చేతనయితే జిల్లాలోని మహిళలు రక్షణ కల్పించండి పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలకు భద్రత ఏర్పాటు చేయాలి అడుగ డుగున ఉన్నటువంటి మద్యం షాపులు నిర్మూలించాలి ఐద్వా డిమాండ్ చేస్తుంది బిజెపి చెప్పేది ఒకటి చేసేది ఒకటి గా వ్యవహరిస్తుంది ఇప్పటికైనా ఒడిశా ముఖ్య మంత్రి గిరిజన మహిళ లకు క్షమాపణ చెప్పాలని గిరిజన మహిళ సంగం డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు వివి జయ జిల్లా సహాయ కార్యదర్శి కిల్లో శశికళ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Aidwa strongly criticizes BJP's dual stance on Odisha CM

You cannot copy content of this page

Scroll to Top