ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Leader Letter to Pawan

Leader Letter to Pawan : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : జూన్ 07; తెలుగుదేశం పార్టీ నేత రెడ్డప్ప శ్రీనివాస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మీటింగ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లకు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ ఛార్జ్ చిట్టా శివారెడ్డి తన సొంత నిధులను ఖర్చు చేశారు.

ఈ ఖర్చుల చెల్లింపులకు సంబంధించి ఆర్ మరియు బి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన , పద్దెనిమిది నెలలు గడిచిన, ఆ బిల్లులు విడుదల కాకపోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం పార్టీ కార్యకర్త ఖర్చు చేసిన సొమ్మును నెలల తరబడి పెండింగులో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page