
Attack on Kuwait : త్రినేత్రం న్యూస్ : కువైట్ సిటీ,జూన్ 03:ఇరాన్ దురాక్రమణ చర్యలో భాగంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడి జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పై ఈ దాడి జరిగినట్లు కువైట్ పౌర విమానయాన జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఈ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయంలో తక్షణమే ఎమర్జెన్సీ ప్లాన్ను అధికారులు అమలులోకి తెచ్చారు.
ఈ క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా విమానాశ్రయ సముదాయంలోని పలు కీలక వసతులు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం అందుతోంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని కువైట్ మీదుగా సాగే విమాన రాకపోకలను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇక్కడికి రావాల్సిన అన్ని విమాన సర్వీసులను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
