Ramavath Ravindra Kumar : ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో విఫలం

TRINETHRAM NEWS

రమావత్ రవీంద్రకుమార్. మాజి శాసన సభ్యులు.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 02 త్రినేత్రం న్యూస్. మున్సిపల్ఎన్నికలుసమీపిస్తున్నవేల దేవరకొండ పట్టణం లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పలువురు బీ ఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో 11వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ యువ నాయకుడు తౌఫిక్ ఖాద్రి ,18వ వార్డుకుచెందినమురారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి కండువా కప్పిఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీ ఏ హామీలను సక్రమంగా నిర్వర్తించడం లేదని కెసిఆర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని తాము , అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుచెప్పుకుంటున్నారని మున్సిపల్ ఎన్నికల్లో సమీపిస్తున్న వేల ప్రజల దృష్టి మరల్చడానికి సిట్ దర్యాప్తు అని బిఆర్ఎస్ నాయకులపై లేని పోనీ ఆ బాండాలు వేస్తున్నారు,ఎవరు ఎన్ని కుట్రలుచేసినా ప్రజలంతా కేసిఆర్ పాలనే కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు

ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు బిల్యానాయక్, నేనావత్ కిషన్ నాయక్ , వాజీద్ , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The government has failed in providing basic infrastructure

You cannot copy content of this page

Scroll to Top