డిండి (గుండ్ల పల్లి) జనవరి 10 త్రినేత్రం న్యూస్. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డి.ఎస్.పి శ్రీనివాస్ అన్నారు. శనివారం డిండి మండల పరిధిలోని డాక్య తండా గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మద్యానికి,డ్రగ్స్ కు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చదువులో క్రీడల్లో రాణించాలని సూచించారు. తల్లిదండ్రులకు , చదువు చెప్పిన గురువులకు పుట్టిన నేల కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై బాలకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, డాక్యతండ సర్పంచ్ వడత్యా శీను, ఉప సర్పంచ్ లక్ష్మి రామ్, వివిధ గ్రామాల సర్పంచులు శంకర్, కిషన్,రమేష్, వార్డు మెంబర్లు శివ హనుమంతు,శ్రీను, ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


