Trinethram News : పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని IAS కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు.
ఎవరికి ఈ పెన్షన్లు?
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు
క్యాన్సర్ రోగులు
దివ్యాంగులు
ముఖ్య నిర్ణయం: ఈ పెన్షన్ల మంజూరుపై.. ఇన్ఛార్జ్ మంత్రి & జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. బాధితులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉపయోగపడుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


