మాధవ రాయుడు పాలెం గ్రామంలో రచ్చ బండ కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామంలో ఈరోజు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామ ఇంచార్జ్ సంగీత వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతులుగా మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ కడియం మండలం నర్సరీల ద్వారా దేశం మొత్తం ఖ్యాతిని సంపాదించుకుందని అలాంటి నర్సరీ వ్యవస్థ వృద్ధి చెండడానికి వై.సి.పి ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి, తొమ్మిది గంటల పాటు నిర్వీరామంగా నర్సరీలకు విధ్యుత్ అందించారని, చంద్రబాబు, ప్రభుత్వ హయాంలో పగలు నాలుగు గంటలు రాత్రి మూడు గంటలకు చొప్పున ఏడు గంటలు మాత్రమే విద్యుత్ అందించే వారిని అన్నారు, ఈ రోజున కడియం మండలం నుంచి ఒక పేద విద్యార్థి జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో నిర్మించిన నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డాక్టర్ విద్యా చదువుతుందని ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు నిదర్శనం అని అన్నారు… పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాడి కష్టం చూసి వాడి కన్నీళ్లు తుడిచే విధంగా పాలన సాగించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఏ పేదవాడు ఆకలి పస్తులతో ఉండకూడదని ప్రతి కుటుంబానికి ఏదోక పథకం ద్వారా లబ్ది చేకూర్చిన నాయకులు దేశంలో ఎవరైన ఉన్నారు అంటే ఆది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, నియోజవర్గం పరి శ సి వకులు నక్క నగేష్, జిల్లా వైఎస్ ఆర్ సి పి ప్రధాన కార్యదర్శి తాడల చక్రవర్తి, ఈలి గోపాలం,ఆకుల సుధాకర్,విప్పర్తి ఫణికుమార్,ముద్దాల అను,రుఖియా సయ్యద్, బుడ్డిగ పండు,గంగారావు,చింతపర్తి రాంబాబు, రానా హరిశ్చంద్ర, గుబ్బల రామ్మూర్తి, నరమామిడి గణేష్, డాక్టర్ చోల్లంగి సత్యగిరి పరిమళ నాని, చింతపర్తి చిట్టిబాబు,నాగిరెడ్డి మోహన్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Madhava Rayudu Palem village Rachcha Banda program

You cannot copy content of this page

Scroll to Top