MLA MS Raj Thakur : 50 కోట్ల వ్యాయామంతో ఏటిసి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు 50కోట్ల వ్యాయంతో ఈ ఏటీసీ సెంటర్ ని ప్రారంభించామని ఈ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ప్రత్యేకంగా ఐటీ, స్కిల్ డెవలప్మెంట్, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ సెంటర్ రామగుండం ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ కేంద్రం ఉపయోగపడనుందనీ తెలిపారు ప్రారంభం సందర్భంగా విద్యార్థులు, స్థానికులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు.తాజా సాంకేతిక పరిజ్ఞానం అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు రామగుండంలో అభివృద్ధి దిశగా మరో అడుగుగా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిలవనుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA MS Raj Thakur inaugurates ATC centre

You cannot copy content of this page

Scroll to Top