MLA TRR : కొత్తకుంట చెరువులో గంగమ్మ తల్లికి హారతి ఇచ్చిన ఎమ్మెల్యే TRR

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: 30 ఏళ్ల తర్వాత పారిన పరిగి కొత్తకుంట చెరువు అలుగు.
పరిగి పట్టణంలోని కొత్త కుంట చెరువులో అధికారులు,స్థానిక నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ.మొదటి విడతలో రూ.30 లక్షలతో కొత్తకుంట అభివృద్ది పనులు చేపట్టాం అని ప్రస్తుతం కట్ట వెడల్పు పనులు జరుగుతున్నాయి.కుంటను మినీ బ్యాంక్ బండ్ తరహాలో ఆధునీకరిస్తాం అని రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం కుంట ఎఫ్టీఎల్ పరిధిలో 29 ఎకరాలకు పెన్సింగ్ వేయిస్తాం.పట్టణ ప్రజలు సేదతీరేలా లైటింగ్ గ్రీవరీని ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.30 సంవత్సరాల తర్వాత పరిగి పట్టణంలో కొత్త కుంట చెరువును పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA TRR performed aarti

You cannot copy content of this page

Scroll to Top