త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పురపాలక సంఘ పరిధిలో పలు నిర్మాణాలకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, శుక్రవారం శంఖుస్ధాపన చేశారు. మండపేట పట్టణంలో 2, 3, 8, 11, 12, 23, 27, 29, 30 వార్డులలో బీపీస్ నిధులు 2 కోట్లతో రోడ్డు మరియు డ్రైన్లు నిర్మించుటకు ఎమ్మెల్యే వేగుళ్ళ శంకుస్ధాపన చేశారు. అదే విధంగా మున్సిపల్ సాధారణ నిధులు రూ.1.05 కోట్లు వ్యయంతో 25వ వార్డులో విజయదుర్గ గుడి వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం నకు, 26వ వార్డులో ఉన్న ముస్లిం షాధీఖాన మొదటి అంతస్ధు నిర్మాణం నకు ఆయన శంఖుస్ధాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర ఎస్.సి కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు యరమాటి గంగరాజు, కాశిన కాశీవిశ్వనాధం, చిట్టూరి సతీష్, శ్రీమతి కాళ్ళకూరి స్వరాజ్య భవాని, శ్రీమతి మలసాని సీతామహాలక్ష్మి, శ్రీమతి కొవ్వాడ బేబి, టీడీపీ నాయకులు వాకచర గుప్తా, చుండ్రు అగస్త్యరాజు, కాళ్లకూరి శ్రీనివాస్, గంటి వీర్రాజు, పాలచర్ల శిరీష్, గుండి తాతరాజు, శిరంగి ఈశ్వరరావు, గడి రాంబాబు, పెందుర్తి ప్రధీప్, బొడ్డు రామకృష్ణ, శెట్టి రవి, చింతల శ్రీను, అధికారులు మున్సిపల్ కమీషనర్ టి.వి.రంగారావు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.శ్రీనివాస్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు డి.వి.పవన్ కుమార్, వార్డు ఏమినిటీస్ సెక్రటరీలు మరియు మున్సిపల్ సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


