దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ఇలాంటి పర్మిషన్ లేదు. ఆ పాఠశాలలో విద్యార్థులను చేర్చి తల్లిదండ్రులు మోసపోవద్దు. కార్పొరేట్ విద్య పేరుతో రంగురంగుల బ్రోచర్లతో ఐపీఎల్ ,ఐఐటి అనే పేర్లతో ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ దేవరకొండ పట్టణంలో విద్యను వ్యాపారంగా చేయడానికి ప్రభుత్వపరంగా ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఖమ్మం శ్రీ చైతన్య యజమాన్యం అడ్మిషన్లు చేస్తున్నారు.
దేవరకొండ పట్టణంలో పర్మిషన్ లేకుండా ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాల యజమాని రాష్ట్రంగా అడ్మిషన్ వర్క్ నిర్వహిస్తున్నటువంటి రూమ్ సీజ్ చేయాలని చెప్పారు ముందు ధర్నా నిర్వహించి షట్టర్ మూసి వేయడం జరిగింది. అనంతరం పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి గోడ స్టిక్కర్లను ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో తొలగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, నాని, మనోహర్, అర్జున్, ఆంజనేయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


