TRINETHRAM NEWS

దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది.

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది…

నెలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలకు అదనంగా మరో రూ.750 చొప్పున ఇవ్వబోతోంది.

సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా ఈ పెంపు నిర్ణయం అమలు చేయబోతున్నట్లు మంత్రి కారుమారి నాగేశ్వరరావు ఇవాళ తిరుమలలో తెలిపారు..