TRINETHRAM NEWS

హైదరాబాద్ నగరం మతసామరస్యానికి ప్రతీక : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

ఈరోజు 128 – చింతల్ డివిజన్ వివేకానంద నగర్ షాబుద్దీన్ బస్తి లోని మహబూబ్ – సుభానీ – చీల్లా లో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాలకు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గంగా జమునా తహజీబ్ అని ఇక్కడ ప్రజలంతా కులమతాలకతీతంగా ఒకటిగా జీవిస్తూ మతసామరస్యాన్ని చాటుతారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండి. చాంద్ పాషా, ఎండి. అలీ, ఎండి. మస్తాన్ సాబ్, ఎండి. ఆసిఫ్, ఎండి. మహబూబ్, నరేష్, చందు, యాదగిరి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.