Trinethram News : కర్ణాటక విజయపుర(D) మంగోలిలోని కెనరా బ్యాంకులో ప్రజలు తాకట్టు పెట్టిన 59 కిలోల బంగారం చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 26న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 23న సాయంత్రం బ్యాంకుకు తాళం వేశారు. 24, 25 సెలవులు, 26న గుమస్తా వెళ్లగా షట్టర్ తాళం కట్ చేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 8 బృందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


