బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు

TRINETHRAM NEWS

డివైజేఏసీ ఆధ్వరంలో సంపూర్ణ మద్దతు
డివైజేఏసీ రాష్ట్ర చైర్మన్ న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్

దేవరకొండ అక్టోబర్ 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం దేవరకొండ మండల కేంద్రంలోని స్థానికంగా ఉన్న డి వై జె ఎ సి కార్యాలయం లో రాష్ట్ర చైర్మన్ న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు వ్యతిరేకులపై నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బీసీ సంఘాల బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నాము అని తెలిపారు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రతిష్టత్మాకంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి కుల ఘననా చేసి అందులో అన్ని వర్గాల ప్రజలకు సామజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీ లకు 42%రిజర్వేషన్ ను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినేన్స్ ను జీవోను విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదం పొందాక ఇంకా పెండింగ్ లో ఉంచడం యావత్ బీసీ సమాజాన్ని మోసం చెయ్యడమే అవుతుందని తెలిపారు ఫ్అదేవిదంగా కేంద్ర ప్రభుత్వం బీసీ ల పట్ల ఉన్న వైఖరి ఏవిదంగా ఉందొ అర్ధం అవుతుంది అని బీసీ ప్రధాని అని చెప్పుకునే మోడీ బీసీ పట్ల పక్షపాత వైఖరి అవాలంబిస్తూ బీసీ సమాజానికి తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం బీసీ ల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆర్డినేన్స్ ను అమోదించాలని లేకపోతె దేశ వ్యాప్త ప్రజా పోరాటం ద్వారా బీసీ సమాజం వారి హక్కులను సాధిస్తారు అని తెలిపారు బీసీ ల న్యాయమైన డిమాండ్ కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతుగా ఉంటారని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

42 percent reservation for BCs

You cannot copy content of this page

Scroll to Top