WhatsApp Image 2024 01 06 at 12.15.10 PM
Trinethram News :
విశాఖ మెడికవర్ హాస్పటిల్ లో జాయిన్ అయిన తమ్మినేని ని పరామర్శ చేసిన వై వీ సుబ్బారెడ్డి
తమ్మినేని సీతారాం స్వల్ప అస్వస్థతకు గురై గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న మెడికవర్ హాస్పటిల్ లో జాయిన్ అయ్యి ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం, కుటుంబ సభ్యుల సూచనల మేరకు విశాఖ పట్నంలో ఉన్న మెడికవర్ హాస్పటల్ కి రిఫర్ చేశారు. ప్రాణానికి ప్రమాదం లేదని త్వరలో కోలుకుంటారు అని వైద్యులు నిర్ధారించారు.
అస్వస్థతకు గురై విశాఖపట్నం లోని మెడికవర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాంని పరామర్శించిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వైవీ సుబ్బారెడ్డి. వారితో పాటు విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కోలా గురువులు వున్నారు. ఆ సమయంలో స్పీకర్ సతీమణి, వారి కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ వున్నారు.
