త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో మంగళవారం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్తో దళిత నేత పార్టీ ఏడిద గ్రామ కమిటీ అధ్యక్షులు పలివెల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ను కలిశారు. ఈ సందర్భంగా జగన్, సురేష్లు సుధాకర్ను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ ఏడాదికే కూటమి పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, భవిష్యత్తులో రాష్ట్రంలో జగన్ సీఎం, మండపేట ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


