త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 3 : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్థానిక వెంకటనగరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత రమేష్ కు సంబంధించిన i20 కారును మంగళవారం అర్థ రాత్రి కొంత మంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అoటించ్చారు ఈ ఘటనలో కార్ పూర్తిగా ధ్వంసం అయింది విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహ కిషోర్కి పూర్తి సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలియజేశారు,ఇప్పటివరకు ఏ రోజు కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగలేదని కొంతమంది ఆకతాయిలు కావాలనే చేస్తున్నారని దీనివల్ల ప్రశాంతంగా ఉండే పల్లెలు ఆగ్రహ జ్వాలలకు బలవుతున్నాయని త్వరగతిన విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని కోరారు,అనంతరం చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తనయుడు చెల్లుబోయిన నరేన్ మరియు పార్టీ నాయకులు కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు, రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని ఆ ధైర్య పడవద్దని ఏ పరిస్థితుల్లోనైనా మేము మీ వేన్నంటే ఉంటామని అవసరమైతే తాను తన తండ్రి కూడా న్యాయం జరిగే వరకూ మీ వెంట ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆచంట కళ్యాణ్,సుందరపల్లి అనిల్,చాప రాజా,అప్పా పరిమళ కుమార్,ఓడూరి రాంకీ,కోల్లి వెంకటరత్నం,కల్లూరి చైతన్య,ఉంద్రజవరపు సూర్య,నక్కా దనరాజ్,అల్లంపల్లి శ్రీను,పంతం ప్రసాద్,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


