Trinethram News : విజయవాడ : 2027లో తాను మళ్లీ పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకొచ్చే అవకాశం లేదు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నాం. ప్లీనరీలోనే పాదయాత్రతో పాటు పార్టీ రాజకీయ వ్యూహ నిర్ణయాలను ప్రకటిస్తాం” అని జగన్ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


