తేదీ: 30/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు రూపాయల కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. దీనిపై హోం మంత్రి అనిత స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లాల్లో ఎమ్మెల్యేలంతా బాధ్యత తీసుకుంటారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


