ఖనిలో ఆటో కార్మిక సేవా సమితి ఆవిర్భావం
గోదావరిఖని మార్చి10//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆటో కార్మిన్నలను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన వ్యాల్ల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆడుకోవాలనే సదుద్దేశం తో ఆటో కార్మిక సేవా సమితి అనె స్వచ్చంద సంస్థను ఏర్పాటుచేసుకోవడం జరిగింది.
ఈ మేరకు గోదావరిఖని గంగానగర్లో ప్రవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గా ఆటో డ్రైవర్లుసమావేశమై ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితి కి అధ్యక్షులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కడార్ల శ్రీధర్ ను ప్రధాన కార్యదర్శి గా ఎల్కపెల్లి అంజయ్యను ముఖ్య సలహాదారు గా బి ఆర్ఎస్ నియొజకవర్గ అధికార ప్రతినిది జాహిద్ పాషా ను సలహాదార్లుగా పోలాడి శ్రీనివాసరావు, నారమల్ల రమేష్ లను అదేవిధంగా డోలి శ్యాం సుందర్, ముత్యాల శంకర్, రాపెల్లి వెంటేష్, నేరేల్ల సత్యనారాయణ, వడ్లూరి రాజశేఖర్ లను కమిటీసభ్యులు గా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పలు అనారోగ్య సమస్యలతొ మృతి చెందిన ఆటో కార్మికులు కిర్తి షేషులు గాజుల చంద్రమౌళి కుటుంబ సభ్యులకు మరియు కీర్తి శేషులు మాహ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఒక్కక్కరీకి 10వేల రాపాయలచొప్పున 20 వేల రుపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషా మాట్లాడుతూ,ఆటో కార్మిక సేవాసమితి ముఖ్య ఉద్దేశం పేద ఆటో కార్మిక అన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సమితి పనిచేస్తుందని, అందుకు వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయూతతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులలో ఆటో కార్మికులు ఆర్థిక, అనారోగ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మికులను ఆదుకునేందుకు మానవతహృదయం తో వీహెచ్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల్ల హరీష్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వారికి నియోజకవర్గ ఆటో కార్మికుల తరపున ధన్యవాదాలు తెలియ జేశారు ఈ కార్యక్రమం లో బురహాన్, నీలారపు రవి, నమేండ్ల కుమార్, ఎండి అన్ను, చందర్, కొండ సంపత్ తో పాటు అధిక సంఖ్యలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


