WhatsApp Image 2023 12 29 at 6.54.53 AM
నేడు విజయవాడకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాక
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ నేడు విజయవాడ లో పర్యటించనున్నారు. మొదట విజయవాడలో గల పాత ప్రభుత్వ జనరల్ హాస్పటిల్ లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్ – 3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
తర్వాత గుంటూరు జిల్లాలో మామిళ్లపళ్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ‘ ఫ్యామిలీ డాక్టర్ ‘ అమలును పరిశీలిస్తారు.మధ్యాహ్నం మంగళగిరి లో ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శిస్తారు. సాయంత్రం 5.15 కు తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు.
