నాగోలు : ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి.. మాటల్లో పెట్టి బంగారు గొలుసులు లాక్కుని పారిపోయారు. నాగోలు ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఎస్సై మధు కథనం ప్రకారం.. మేడ్చల్కు చెందిన పసుపులేటి శిరీష(36), ఎన్టీఆర్ నగర్కు చెందిన ఉన్నీసా బేగం అలియాస్ సమీనా(40) బ్యుటీషీయన్లుగా పని చేస్తున్నారు. సులువుగా సంపాదించేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో నాగోలు మత్తుగూడ సమీపంలోని తాజా హోటల్లో ఇటీవల ఓ వృద్ధుడిని పరిచయం చేసుకున్నారు. అతని ఫోన్ నంబరు తీసుకుని తరచూ మాట్లాడసాగారు. ఆదివారం తిరిగి హోటల్ వద్దకు వచ్చి అతడికి ఫోను చేశారు. హోటల్ వద్దకు రావాలని కోరారు. ఇంట్లో ఎవరూ లేరని, తానూ రాలేనని చెప్పిన వృద్ధుడు.. వారినే తన ఇంటికి ఆహ్వానించాడు. ఇదే అదనుగా ఇంట్లోకి చేరిన ఆ ఇద్దరూ.. వృద్ధుడిని మాటల్లో పెట్టారు. అనంతరం అతని మెడలోని రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బంగారు గొలుసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. ఉన్నీసాబేగం మరో వ్యక్తితో కలిసి హయత్నగర్ ఠాణా పరిధిలోనూ ఇదే రీతిలో ఓ వ్యక్తిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు
Related Posts
MLA KP. Vivekanand : నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS New welfare association members will always have our support: MLA KP. Vivekanand Trinethram News : Medchal : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎన్ క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన…
Kuna Srisailam Goud : మచ్చలేని నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు
TRINETHRAM NEWS The Congress leaders raised the flag in a press conference on the comments made by the BRS corporators against the spotless leader Kuna Srisailam Goud Trinethram News :…