Tribals Rally : పలక జీడి వారపు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలి

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, యు. చీడిపాలెం పంచాయతీ, పరిధిలోని మారుమూల గ్రామమైన,, పలకజీడి వారపు సంతలో శుక్రవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. వారపు సంతకు వచ్చిన పలు గ్రామాల గిరిజనులు మావోయిస్టులకు, వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు.

మావోయిస్టు వారోత్సవాలుమాకు వద్దు, గిరిజనుల అభివృద్ధే మాకు ముద్దు అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టులారా ఎవరి మేలు కోసం ఈ వారోత్సవాలు, ఎందుకు కట్టాలి స్థూపాలు అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరపు సంతకు వచ్చిన గిరిజనులందరూ స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribals rally against Maoists

You cannot copy content of this page

Scroll to Top