Trinethram News : ఆంధ్రప్రదేశ్ : విశాఖలోని యారాడ బీచ్లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్విమ్మింగ్ చేస్తున్న 16 మంది ఇటలీ దేశస్తులను మెరైన్ సిబ్బంది, జీవీఎంసీ లైఫ్ గాడ్స్ హెచ్చరించినప్పటికీ వినలేదని సమాచారం. న్యూ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


