Trinethram News : Jul 18, 2025, విశాఖ తీరంలో మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ను జాతికి అంకితం చేయనున్నారు. రూ.2396 కోట్ల వ్యయంతో హిందూస్తాన్ షిప్యార్డ్లో 80% దేశీయ సాంకేతికంతో దీన్ని నిర్మించారు. 10,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌక ప్రత్యేక డైవింగ్ టీమ్, హెలికాప్టర్, రిమోట్ ఆధారిత వ్యవస్థలతో సముద్ర రక్షణ, పరిశోధన, జలాంతర్గామి సహాయ కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. శుక్రవారం విశాఖపట్నంలో జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


