తేదీ : 23/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); పహాల్ గామ్ లో ఉగ్రదాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు కె .పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలకు మరియు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాను ఇవాళ అవతనం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని సూచించారు. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించడం జరిగింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రదాడిని ఖండించాలని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


