
Three Arrested : Mar 14, 2026, జన్నారం: జన్నారం మండలం తాళ్లపేట అటవీ రేంజిలో చిరుతపులిని హతమార్చి, దాని గోళ్లను సేకరించిన కేసులో ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. ఊట్ల గ్రామానికి చెందిన వెంకటేష్, శ్రీనివాస్, పాత మామిడిపల్లికి చెందిన శ్రీకాంత్ లను అటవీ ప్రాంతంలో ఉచ్చువేసి చిరుతపులిని చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

