త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పట్టణంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్ బి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం వసతి హాస్టల్ పరిశుభ్రత మెనూ ఎలా ఉన్నది మంచిగా పెడుతున్నారా అని విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన కళాశాల సిబ్బందితో మాట్లాడుతూ, విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎటువంటి తేడా జరగకూడదు నాణ్యమైన కూరగాయలు నాణ్యమైన సరుకులతో విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని ఈ విషయంలో ఎటువంటి తేడా జరిగినా కూడా మున్సిపాలిటీ పరిధిలో చట్టపరమైన చర్యలు ఉంటాయని. కళాశాల సిబ్బందికి హాస్టల్ సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంగీత హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


