బాలికను చంపి డ్రమ్ములో దాచేసిన నిందితుడు….
విషాదంగా మారిన బాలిక అదృశ్యం కేసు…
Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక దారుణ హత్య వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతుంది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైన సంగతి పాఠకులకు తెలిసిందే.
కాగా జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిపెల్లి డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సీఐ మహమ్మద్ రఫీ, సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పూటేజీ ఆధారంగా రిషిక ప్రియ ను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుట్టినట్లు గుర్తించి హత్య జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


