Student Died in America : అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

TRINETHRAM NEWS

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు.
తెలంగాణ హనుమకొండ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లిన వంశీ అక్కడే చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి అతను ఉంటున్న అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కారు సీట్లో మృతిచెంది కనిపించాడు. అక్కడే ఉన్న తోటి విద్యార్థులు ఆదివారం సమాచారం ఇవ్వడంతో వంశీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top