తేదీ : 23/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి విజయ దుందుభి మోగించడం జరిగింది. బుంగా. హన్సిత ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించగా ఏనుగు .సాయి స్వర్ణ మాధురి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారు.
ఆ పాఠశాలలో నలబై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇరవై ఏడు మందికి పైగా ఐదు వందలు మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ మరియు చైర్మన్ యస్.వై. వి. సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నక్కా సూర్యకుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


