హనుమాన్ జయంతి సంధర్బంగా పలుచోట్ల అన్న సమారాధన…
పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్ . శ్రీ హనుమాన్ జయంతి ని పురష్కరించుకుని జెడ్.మేడపాడు, ఇప్పనపాడు గ్రామాలలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా స్వామివార్కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపేట పట్టణంలో రధం సెంటర్, బురుగుంట చెరువు వద్ద హనుమాన్ జయంతి సంధర్బంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలలో ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో జెడ్.మేడపాడు సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, గ్రామశాఖ అధ్యక్షులు ఈదిపల్లి మంగరాజు, అత్తిలి వెంకన్నబాబు, సంగిశెట్టి అమ్మన్న, కంచర్ల రాము, భీమన వెంకటరమణ, గట్టా రమేష్, సంగిశెట్టి వెంకటేశ్వరరావు (శీను), సంగిశెట్టి నారాయణ, గట్టి గణేష్, ఊడి నరసన్న, కంచర్ల శ్రీను, బగులు శ్రీను, చామీరు సుబ్బారావు, తిరువీధుల బాబి, కంచర్ల మణికంఠ, కంచర్ల చిన్న, తోరాటి సత్తిబాబు, తోరాటి శ్రీను, చోడె పెదకాపు, రిమ్మలపూడి యామిని శ్రీనివాస్, కుంచె ప్రసాద్, నైశెట్టి వీరవెంకట రమణ, ఆనంద్, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


