తేదీ : 17/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ అడ్మిషన్ లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మణేంద్ర రావు తెలిపారు. బిఎ రాజనీతి శాస్త్రం లో ఇరవై ఆరు, బి ఎ చరిత్ర ఎనిమిది , బీఎస్సీ జువాలజీ లో ఇరవై ఎనిమిది, బీకాం జనరల్ లో నలభై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ ఈనెల ఇరవై లోపు పైన తెలిపిన కోర్సుల్లో చేరాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


